నారాయణఖేడ్ ఉప ఎన్నిక: అధికా టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ మేరకు కౌంటింగ్ కేంద్రమైన జుక్కల్ పాలిటెక్నిక్ కళాశాలలో 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 21 రౌండ్లు సాగే ఓట్ల లెక్కింపు ఫలితం ఉదయం 11 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఖమ్మంలోనే కేసీఆర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రెండో రోజుకు చేరుకుంది. సోమవారం ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి నేడు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తారు.
వీరజవాన్ ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలు: సియాచిన్ మంచుకొండల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా పార్నపల్లెలో జరగనున్నాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పార్నపల్లి వెళ్లి ముస్తాక్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. జవాన్ కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
అగ్రిగోల్డ్ కేసు: ఏలూరులోని పశ్చిమగోదావరి జిల్లా కోర్టులో నేడు అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగనుంది. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి తీర్పు చెప్పే అవకాశంఉంది.
ఎమ్మెల్యే రోజా స్పెన్షన్ పై విచారణ: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా సస్పెన్షన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
తాడ్వాయి ఎన్ కౌంటర్ కేసు: వరంగల్ జిల్లా తాడ్వాయిలో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఢిల్లీకి బాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సిస్కో చైర్మన్ తో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లి మేక్ ఇన్ ఇండియా వీక్ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు.
అఖిల పక్షసమావేశం: 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
0 comments:
Post a Comment